పిట్లం మండలం తిమ్మా నగర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీల వితరణ చేశారు. పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తిమ్మానగర్ పాఠశాలలో విద్యార్థుల కోసం పది బెంచీలను అందించామన్నారు. తిమ్మానగర్ గ్రామానికి చెందిన పిట్లం లయన్స్ క్లబ్ అధ్యక్షులు, రిటైర్డ్ తహసీల్దార్ నారాయణ తన సొంత డబ్బులుతో విద్యార్థుల సౌకర్యం కోసం బెంచీలను అందించడం జరిగింది, ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయుల బృందం నారాయణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ కో ఆర్డినేటర్ మర్గల వేణు, డిస్ట్రిక్ట్ చైర్మన్ కిషన్, కార్యదర్శి బాలు, మాజీ అధ్యక్షులు కాశిరెడ్డి, సొసైటీ CEO అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.