పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం సందర్శించారు. విద్యార్ధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పలు సలహాలు సూచనలు సూచనలు ఇచ్చారు. తరగతి గదుల్లోకి వెళ్లి అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాన్ని క్షుణంగా పరిశీలించారు. నూతన ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టి నవిజయ్ శేఖర్ కు అభినందించారు.అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ,సలహాలు చెప్పారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని కష్టపడి చదివి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన గుర్తు చేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.