పిట్లం మండలంలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారి దేవి సింగ్ పరిశీలించారు.
మద్దెల చెరువు ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు బండాపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నమోదు అయిన పిల్లల సంఖ్య , హాజరు, టీచర్ల హాజరు పరిశీలించారు. బేస్ లైన్ టెస్ట్ వివరాలు, ఆన్లైన్ నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా వుండే విధంగా చూడాలని సూచించారు. మద్దెల చెరువు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంఖ్య , బండపల్లి ప్రధానోపాధ్యాయుడు గోపి , పాఠశాలల సిబ్బంది మధుసూదన్, అరుణ్ కుమార్, జ్యోతిలక్ష్మి, మహేందర్ రెడ్డి, సాయిలు, శ్రీనివాస్, హన్మాండ్లు ,లావణ్య , ఆ ప్రాంత CRP గోపాల్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.