పిట్లం మండలం చిన్న కొడప్ గల్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా పూజలు చేసినట్లు ఆయన చెప్పారు. పరమ శివుడి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.