సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. జుక్కల్ మండలం ఖండేబల్లూరు గ్రామానికి చెందిన రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాల కోసం పిట్లం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో అధికారి అందుబాటులో లేకపోవడంతో, రైతులు ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేశారు. మాట్లాడుతూ, గతంలో తమ భూములకు పట్టాలు ఉన్నాయని, అయితే ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన సమయంలో తమ భూములను పార్ట్ బి లో చేర్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా తమకు పట్టాలు రావడం లేదని పేర్కొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.