ట్రాక్టర్ నడిపి.. మొక్కలు పంపిణీ చేసిన ఎంపీడీఓ
ట్రాక్టర్ నడిపి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ను గ్రామస్తులు అభినందించారు. మండలంలోని పడంపల్లి గ్రామంలో హరిత వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ చేశారు. ఎంపీడీవో స్పెషల్ ఆఫీసర్ గ్రామంలో ట్రాక్టర్ లో…
పెద్ద ఎక్లారలో వ్యక్తి కి పాముకాటు
మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో సిద్ధిరాం అనే వ్యక్తి పాముకాటుకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లోకి ఓ ములన ఉన్న పాము కాటు వేసినట్లు చెప్పారు. పాము కాటు వేయడంతో చుట్టుపక్కల వారికి సమాచారం చెప్పడంతో పక్కింటి వారు వచ్చి…
పడంపల్లి లో విద్యార్థులకు వైద్య పరీక్షలు
జుక్కల్ మండలం పడంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్యుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల బరువు ఎత్తు కొలతలు తీశారు. ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలని, విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని ఆర్.బీ. ఎస్ వైద్యుడు విక్రమ్ సూచించారు. పౌష్టికాహారం లోపం ఉంటే…
నాగల్ గావ్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఎంపీవో
జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) రాము సందర్శించారు. పంచాయతీకి సంబంధించిన పలు (దస్రాలు) రికార్డులను పరిశీలించారు. గ్రామంలో సమస్యలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎప్పటికప్పుడు…
జుక్కల్ లో పోలీసు కళాజాత బృందం అవగాహన
జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు షి టీమ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్…
జుక్కల్ లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు
9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులందరు పాల్గొంటున్నారని జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కు మండలంలోని పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికుల ప్రతినిధులతో కలిసి సిఐటియు…
ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండల వైద్య విద్యార్థి మృతి
పుట్టినరోజు నాడే గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి ఘటన డోంగ్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిలిప్పీన్స్ దేశంలో డోంగ్లీ మండలం కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్ధి వడ్ల యోగి (23) మృతిచెందాడు.…
మద్నూర్ లో వర్షం
మద్నూర్ తో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సుమారుగా 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరుతో మురుగు కాలువలు నిండిపోయి రోడ్లపై ప్రవహించాయి.
మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు
మద్నూర్ విద్యా వనరుల కేంద్రంలో కార్యాలయ సిబ్బందికి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మద్నూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ ఒక్కరోజు సమ్మెలో…
ఇది రాచూర్ రోడ్డు దుస్థితి సారు…
మద్నూర్ మండలం రాచూరు గ్రామానికి వెళ్లే రోడ్డు బురదమయంగా మారి కాలిబాటను కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు చిన్నపాటి వర్షానికే రోడ్డుపై గుంతల్లో వర్షం నీరు…