నిజాంసాగర్ జలాశయం (ప్రాజెక్టు)లోకి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అప్రమత్తం (అలర్ట్) చేశారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాబోయే 24 గంటల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని తహశీల్దార్ భిక్షపతి, నీటిపారుదల శాఖ ఏఈలు అక్షయ్ కుమార్, సాకేత్లు తెలిపారు. జాలర్లు, గొర్రెల కాపర్లకు (అలర్ట్) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీర పరీవాహక ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లు, గొర్రెల కాపర్లు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి ఉధృతి ఉంటుందని, పరీవాహక ప్రాంతాలవైపు వెళ్లవద్దని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు గాను 10.79 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సింగూరుకు భారీగా వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.