మద్నూర్ లోని బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 6,7,8 తరగతులకు సంబంధించిన బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష ను నిర్వహించినట్లు ఉమ్మడి నిజామాబాదు జిల్లా కన్వీనర్ నీరడి గంగాశంకర్ తెలిపారు. 128 మంది బాలురు దరఖాస్తులు రాగా, 122మంది బాలురు ప్రవేశపరీక్షను హాజరయ్యారు. కేటగిరీలబట్టి ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తామని అన్నారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు .బోధన సిబ్బందితో సమావేశము నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట అసిస్టెంట్ ప్రిన్సిపాల్ బచ్చు సుమన్, ఉపసంక్షేమాధికారి నరహరి ప్రసాద్, అధ్యాపకులు డా బి. వెంకట్, జాదవ్ గణేశ్, రాము, నరేష్, బస్వరాజు తదితరులు ఉన్నారు
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.