మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి లెండి వాగు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సోనాల- తడిహిప్పర్గ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం మద్నూర్ లో సంతకు వచ్చిన ఆ గ్రామస్తులు సోనాల గ్రామం వద్ద ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహశీల్దార్ ముజీబ్, ఎంపీడీవో రాణి ఇతర అధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడాతు.. ఎవరు కూడా నీళ్లలో నుంచి దాటే ప్రయత్నం చేయవద్దని వారికి సూచించారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.