వరద బాధితుల సహాయ కేంద్రంను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు.  ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి గురువారం ఉదయం సిర్పూర్ గ్రామ నుండి 15 కుటుంబాల బాధితులను తరలించారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి వరదలు తగ్గే వరకు వారికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గత వారంలో వచ్చిన వరదల మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నందున రెవెన్యూ, పోలీస్, అధికారులు తడి హిప్పర గ్రామంలో వరద ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురి కావొద్దు అని మద్నూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రము కు తరలిస్తాం రావాలని అన్నారు.  సబ్ కలెక్టర్  వెంట తహసీల్దార్ ఎం.డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, ఎస్.ఐ విజయ్, కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *