తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే తగు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్నూర్, బిచ్కుంద మండలాలలో తారు రోడ్లపై తిరుగుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్ డ్రైవర్లకు రోడ్లపై నడపద్దని అవగాహన కల్పించారు. రెండు ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారి (ఏ.ఎమ్.వి.ఐ) శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేజీ వీల్స్ ట్రాక్టర్లు కేవలం మట్టి రోడ్లపైనే నడపాలని గుర్తు చేశారు. లక్షల ఖర్చు చేసి నిర్మాణం చేసిన తారు రోడ్లపై కేజీ వీల్స్ నడపడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తారు రోడ్లపై కేజీ వీల్స్ నడవకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.
