ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఆదుకోవాలని పెట్టుబడి సహాయాన్ని తొలకరి వర్షాలకు ముందే వారి ఖాతాల్లో జమ చేయడం ఇది చరిత్రలోనే మొదటిసారి అని మద్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దారస్ సాయిలు అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ముఖ్యమంత్రి, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల్లో ఎనలేని నమ్మకం పెరిగిందన్నారు. గత ప్రభుత్వము వ్యవసాయ పనులన్నీ ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని, ఈ ప్రభుత్వంలో పనులకు ముందే రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులకు అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. అభివృద్ధి పథంలో ప్రయాణించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. ఆయనతో పాటు ఆలయ చైర్మన్ రామ్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, సీనియర్ నాయకులు కొండ గంగాధర్, హన్మాండ్లు తదితరులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.