మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గేట్ వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేస్తూ వాటిని పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలను సందర్శించ ఆయన విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. సమస్యలు విన్న కలెక్టర్ వెంటనే స్పందించి తాగునీరు ఇతర సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు నీటి సమస్య ఉండటంతో వెంటనే బోర్ వెల్ కొరకు లక్ష రూపాయలు మంజూరు చేశారు. హాస్టల్ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డు కాపల ఉండటానికి షెడ్డు నిర్మాణం కోసం లక్ష రూపాయలు వెంటనే మంజూరు చేశారు. మెస్ వద్ద కు వెళ్ళడానికి విద్యార్థులకు సౌకర్యంగా ఉండటానికి నాలుగు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా హాస్టల్ లో అటవీ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్ ఎం.డి ముజీబ్, ఎంపిడిఓ రాణి, ఎంపీవో నర్సయ్య, గిర్దవార్ శంకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.