జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మండల కేంద్రంలో మైథిలి ఫంక్షన్ హాల్ లో మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టులకు కీలక బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో జర్నలిస్టులే కీలకమని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం వార్తలు రాయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల జర్నలిస్టులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.