జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు అన్నారు. ఎమ్మెల్యే తోటపై మాజీ ఎమ్మెల్యే షిండే చేసిన ఆరోపణలపై ఆయన ఖండించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ యువతపై అక్రమ కేసులు బనాయించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని..బీఆర్ఎస్ హయాంలోనే జుక్కల్ నియోజకవర్గంలో అనేక మందిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించిన విషయం షిండే సారూ… మర్చిపోయారా…? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గంలో యువతకు అధిక ప్రాధాన్యతమిస్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయంలో మీరు 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అభివృద్ధి ఏమిటో…?
రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో…? మాతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయంలో నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండేళ్లులోపే ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఉన్న సమయంలో మంజీరా నది నుంచి వందలాది ఇసుక లారీలను తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని ఆయన ఎద్దేవా చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, వైస్ చైర్మన్ పరమేష్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, నాయకులు కొండ గంగాధర్, మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు శశాంక్ పాటిల్, హన్మాండ్లు, వామన్ రావు, రమేష్ తదితరులు ఉన్నారు
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.