మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్దామని ఆబ్కారీ ఎస్.ఐ నగేష్ అన్నారు. మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో డ్రగ్స్, గంజాయి నిషేధంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యసనం మిమ్మల్ని చంపకముందే చనిపోయేలా చేస్తుందని చెప్పారు. పలు విషయాలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులకు తెలియజేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.