పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కార్యదర్శులకు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో, ఎంపీవో రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కార్యదర్శులు వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగేలా చూడాలని,
సీజనల్ వ్యాధిలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.