జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు షి టీమ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. పాఠశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కళాబృందం వారు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. ఎవరైనా ఫోన్ లో ఏటీఎం పిన్ నెంబర్ అడిగితే చెప్పకూడదని చెప్పితే ఖాతాలోని డబ్బులు మాయమవుతాయని దీనిని సైబర్ క్రైమ్ అంటారని సూచించారు. ప్రమాదాలు జరగకుండా వాహన చట్టాలు ఉన్నప్పటికీ కొందరు యువకులు చెడు వేసినాలకు బానిసై నిబంధనలో ఉల్లగిస్తూ ప్రమాదాల బారిన పడుతూ జీవితాలు కోల్పోతున్నారని ఆటపాటలతో అందరికీ అర్థమయ్యే రీతిలో కళాబృందం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం , పోలీసు కళాబృందం సభ్యులు, జుక్కల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.
