జుక్కల్ బస్టాండ్ లో గుంతల మరమ్మత్తులు, పిచ్చి మొక్కల తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు స్పందించి మండల స్థాయి నాయకులు కార్యకర్తలకు పనులు త్వరగా చేయించాలని ఆదేశించడంతో స్థానిక నాయకులు కార్యకర్తలు పనులను పూర్తి చేశారు. బస్టాండ్ ప్రాంతమంతా పరిశుభ్రంగా చేసి ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని జుక్కల్ బస్టాండ్ ను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని నాయకులు అన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు నాయకులు సతీష్ పాటిల్, గంగు నాయక్, బాలాజీ, సురేష్, సాయి కుమార్, మాధవరావు ప్రసాద్, విజయ్ కుమార్, విలాస్, మారుతి తదితరులు ఉన్నారు
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.