జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు బురదలు కూరుకుపోయింది. దీంతో డ్రైవర్ ఎంత సేపు బస్సు ను బయటకు తీసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. జేసీబీని తీసుకువచ్చి బస్సు వెనుక భాగం నుంచి తోయడంతో బస్సు ను బురదల నుంచి బయటకు తీశారు. బస్టాండ్ ప్రాంతం వద్ద చిన్నపాటి వర్షానికి బురద మయంగా మారి బస్సు తో పాటు ప్రైవేట్ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వాహనాలు బురదలో కూరుకుపోయిన పట్టించుకునే నాధుడు లేడని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరం వేసి చదును చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.