జుక్కల్ శివారులో పెసర పంటను వ్యవసాయ అధికారులు రైతులతో కలసి పరిశీలించారు. జుక్కల్, హంగర్గ ఏఈఓలు పండరి, నాందేవ్ లు పరిశీలించారు. పెసర పంటకు సోకిన తెగులు నివారణకు పిచికారి చేసే మందుల గురించి సలహా, సూచనలు ఇచ్చారు. రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ తరపున సూచనలు అందిస్తున్నామని అధికారులు చెప్పారు. రైతులకు ఏ అవసరం వచ్చిన వ్యవసాయ శాఖకు సంప్రదించాలని అన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.