జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) రాము సందర్శించారు. పంచాయతీకి సంబంధించిన పలు (దస్రాలు) రికార్డులను పరిశీలించారు. గ్రామంలో సమస్యలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎప్పటికప్పుడు గ్రామంలో శుబ్రత పాటించాలని అన్నారు. నీటి ట్యాంకులు వారానికి రెండుసార్లు శుభ్రం చేయించాలని సూచించారు. దోమల బెడద వ్యాపించకుండా గ్రామంలో ఫాగింగ్ చేయాలని గ్రామ కార్యదర్శి లింగురాంకు ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు గా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో మంచాన పడితే పైఅధికారులకు తెలియజేయాలన్నారు. వెంటనే వారిని గుర్తించి మండల ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించాలని తెలిపారు. ఆయనతో పాటు ఎఫ్ఏ బాబు తదితరులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.