విధులలో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ సామాజిక ఆసుపత్రి సూపరింటిండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్ ఇవ్వాలని డిసిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, డ్యూటీ డాక్టర్ డాక్టర్ విట్టల్ లు అందుబాటులో లేకపోవడంతో అగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం అనేక వ్యాధులతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవలు కొరకు వస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేద ప్రజలకు ఎవరు వైద్యం చేస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాజ్ నోటీస్ అందించాల్సిందిగా DCHS డాక్టర్ విజయలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జుక్కల్ తహశీల్దార్ తదితరులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.