జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే స్పందించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫోన్లో విషయాన్ని చెప్పారు. వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించారు. వైద్య బృందం అనారోగ్యానికి గురైన వారికి పరీక్షలు చేసి, వైద్యం అందించి, మందులను అందజేశారు.
కొందరి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు కూడా పంపిస్తామని వైద్యులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు రోగులకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని ఎమ్మెల్యే  అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గోరు వెచ్చని నీటిని త్రాగాలని, సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు గుర్తు చేశారు.  దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడతారని, దోమలకు ఆవాసయోగ్యమైన మురుగు నీరు ఇంటి చుట్టు ప్రక్కలా నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *