అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగిస్తున్న పోషన్ ట్రాకర్ యాప్ ను తొలగించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యాప్ లను నిర్వహిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ టీఎస్ యాప్, కేంద్ర ప్రభుత్వం. పోషణ్ ట్రాకర్ యాప్ లను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహిస్తున్నారని ఎన్ హెచ్ టి హెచ్ యాప్ ను కొనసాగిస్తూ.. పోషణ్ ట్రాకర్ యాప్ ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ నిర్వహణ అంగన్వాడీ టీచర్లకు తలకు మించిన భారమైనదని, ఈ యాప్ ఒకసారి ఓపెన్ అయితే మరోసారి ఓపెన్ కాదని ఇలా గంటల సమయం కేటాయించాల్సి వస్తుందని అన్నారు. ఈ యాప్ నిర్వహణ భారంతో అంగన్వాడి టీచర్లకు ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యాప్ ను రద్దు చేయాలని కోరారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.