శభాష్ పోలీస్.. మద్నూర్ ఎస్సై విజయ్ కొండ సేవలు అభినందనీయం అంటూ ఈ మాటలు మద్నూర్- డోంగ్లి మండలాల ప్రజల నోటా వినిపిస్తుంది. ఎందుకు అంటారా…? ఒక్కసారి ఈ చిత్రం (ఫోటో) చూడండి. డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలోకి వరద నీరు రావడంతో అక్కడ స్థానికులను మద్నూర్ మండల కేంద్రంలోని పునరావాస కేంద్రానికి కేంద్రానికి అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో చూసిన ఎస్ఐ వెంటనే తన చేతులపై వృద్ధురాలిని ఎత్తుకొని ఇలా వాహనం వద్దకు తరలించి అందరి మన్నలను పొందారు. కన్నతల్లి ఆపదలో ఉంటే ఎలా స్పందిస్తానో..అదే విధంగా స్పందించానాని ఎస్సై విజయ కొండ తెలిపారు. పోలీసు శాఖ ఉన్నది ప్రజల కోసమేనని ఆయన గుర్తు చేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.