సమాజ సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. డోంగ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ గ్రామానికి చెందిన శివరాజ్ పటేల్ షూ పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులను చూస్తుంటే దేశ భవిష్యత్ కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. విద్యార్ధి దశ అతి ముఖ్యమైనదని, విద్యార్థులందరూ బాధ్యతగా విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి పురోగతికి, సమాజం, దేశ అభ్యున్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు నిర్మిస్తామని, ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.