కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగులో నీరు పెరిగి దాదాపు 500 గొర్రెలు, ముగ్గురు గొర్ల కాపరులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు తక్షణమే అధికారులను సంప్రదించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులకు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ సంఘటనలో ఎవరికి ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు అధికారులతో గ్రామస్థులతో నిరంతరం మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గొర్రెల కాపులను క్షేమంగా ప్రత్యేక బృందం అధికారులు బయటికి తీసుకువచ్చారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.
