బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూరి బాలికల విద్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. విద్యార్థుల తరగతి గదులను తిరుగుతూ చదువు అందువు, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, భోజనం ఇతర సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆమెతోపాటు ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బృందం ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.