బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తిచేయాలని భాజపా మండల అధ్యక్షుడు విష్ణు డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించాలని వినతి పత్రం ఇచ్చేందుకు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఖాళీ కుర్చీకే వినతి పత్రం అందజేసి నిరసన తెలిపినట్లు ఆయన చెప్పారు. రోడ్డు పనులను ప్రారంభించి మధ్యలోనే వదిలివేయడంతో వ్యాపారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ముతో వాహనదారులు ప్రజలు ముక్కు మూసుకునే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వాహనదారుల కళ్ళల్లో దుమ్ము పడి ఆసుపత్రి పాలవుతున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులను కొను ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల జనరల్ సెక్రెటరీ జాదవ్ పండరి, మండల ప్రబారి శివాజీ పటేల్, మండల ఉపాధ్యక్షులు హాట్కరీ గణపతి, ధర్మానాయక్, బిజెపి సీనియర్ నాయకులు మల్లికార్జున్ దేశాయి, మొగులు గోండ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.