కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి రికార్డులను పరిశీలించి లారీల వద్ద నుంచి చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది అక్రమంగా వసూలు చేసిన రూ. 36 వేల  నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. లారీల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం జూన్ 26న ఇదే చెక్ పోస్ట్ పై అప్పట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లారీల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 92 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు నెలలు గడవక ముందే తిరిగి ఇదే చెక్ పోస్ట్ పై ఏసీబీ పంజ విసరడం గమనార్ధం.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *